ఆటో ద్విచక్రవాహనం ఢీకొని ఇరువురికి గాయాలైన సంఘటన మంగళవారం గాలివీడు మండల కేంద్రంలోని చోటుచేసుకుంది. నూలివీడుకు చెందిన యోగాంజులు, పార్వతి ఇరువురు ద్విచక్ర వాహనం పై చాకిబండలోని దేవాలయానికి వెళ్లి వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో మేకలను తప్పించబోయే క్రమంలో ద్విచక్రవాహనం- ఆటో పరస్పరం ఢీకొనడంతో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరికీ గాయాలయ్యాయి. ఆటో ఉన్న ప్రయాణికులు ఇద్దరు చిన్నపిల్లలకు స్వల్పగాయాలయ్యాయి.