అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర ముప్పుపై దర్యాప్తు కొనసాగుతోంది. అబూబకర్ సిద్ధికి, మహమ్మద్ అలీ ఇళ్లలో పోలీసులు మరోసారి తనిఖీలు చేశారు. సిద్ధికి ఇంట్లో ఢిల్లీ చిరునామాతో పంపేందుకు సిద్ధంగా ఉంచిన పార్శిల్ బాంబు, మందుగుండు సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు, పాస్పోర్టులు, బ్యాంకు పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అనుమానితులను విచారిస్తున్నారు.