మత సామరస్యానికి ప్రతీక జెండా మాను మహోత్సవమని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు గ్రామం దూదేకులపల్లెలో వైభవంగా జరుగుతున్న జెండా మాను మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డికి గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికి ఆయన చేత ప్రత్యేక పూజలు నిర్వహింపచేసి ప్రసాదాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, భగవంతుడి దయతో ప్రజలు సంతోషంగా ఉండాలని అన్నారు.