అకాల వర్షంతో మామిడి రైతన్నకు అపార నష్టాన్ని మిగిల్చాయి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి, సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ళ శ్రీనివాసులు అన్నారు. శనివారం లక్కిరెడ్డిపల్లె మండలం మద్దిరేవుల గ్రామ పరిధిలోని మార్లవాండ్లపల్లి చెందిన రవికుమార్ రెడ్డి మామిడి తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నారు.