రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి విశేష కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండ రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మంత్రి రామాపురం మండలం, గువ్వలచెరువులో నూతనంగా నిర్మించిన మసీదును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు వివిధ పథకాలు అమలు చేసి వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతోందన్నారు.