కశ్మీర్లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన మురళీనాయకు జోహార్లు చెబుతూ రాయచోటిలో శుక్రవారం రాత్రి గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం నుంచి బస్టాండ్ రోడ్డు, నేతాజీ కూడలి వరకు వీరమరణం పొందిన మురళీనాయక్ చిత్రపటంతో జోహార్ యుద్ధ వీరా అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.