అన్నమయ్య జిల్లాలో రహదారుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం రాయచోటి కలెక్టరేట్ లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా అజెండా అంశాలలో 2023, 2024లో జరిగిన ఇంటిగ్రేటెడ్ రోడ్డు ప్రమాదాల డేటా తనిఖీ అంశాలపై సమీక్షించారు.