రాయచోటి: పండ్ల మార్కెట్ లో అధికారుల తనిఖీలు

67చూసినవారు
రాయచోటి: పండ్ల మార్కెట్ లో అధికారుల తనిఖీలు
రాయచోటిలోని పండ్ల మార్కెట్లో మార్కెటింగ్ శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. మామిడి పండ్లను మందులతో మాగపెట్టడంతో ఆరోగ్యానికి హానికరమని వ్యాపారులకు సూచించారు. ఆహార కల్తీకి పాల్పడితే ఆహార భద్రత చట్టం ప్రకారం చర్యలు తప్పవని జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీ త్యాగరాజు హెచ్చరించారు. మార్కెట్లలో వ్యాపారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజారోగ్యానికి హానికరమైన మందులు వినియోగించకూడదన్నారు.

సంబంధిత పోస్ట్