ఈ నెల 17న మూడవ శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖలు ప్రణాళిక బద్ధంగా పటిష్టంగా నిర్వహించాలని జెసి ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాను స్వచ్ఛరహితంగా రూపొందించేందుకు ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా అమలు పరిచేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.