ఎంఎల్సీ భూమిరెడ్డి రామభూపాల్ రెడ్డిని ఆదివారం ఆర్జేయూపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు కలిశారు. ప్రస్తుతం జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ఆంజనేయులు తెలిపారు. సమస్యలపై ఎంఎల్సీ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్జేయూపీ నాయకులు పాల్గొన్నారు.