రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్నమయ్య జిల్లాలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం రాయచోటిలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయని, మదనపల్లిలో వైద్య కళాశాల పనులు ఆగిపోయాయని ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా పనులు రద్దు చేయడం దారుణం అని అన్నారు.