ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇళ్ల నిర్మాణాలలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు.
గురువారం రాయచోటి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రాయచోటి, రాజంపేట, మదనపల్లి మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల ఎంపీడీవోలు, హౌసింగ్ శాఖ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బందితో ఎన్టీఆర్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.