రెవెన్యూ సదస్సులు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటిలోని కలెక్టరేట్ భవనం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. చాలా మండలాల్లో రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.