రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం 14 వ తేదీన ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలోని జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావొద్దని తెలిపారు.