భద్రకాళీ సమేత వీర భద్రస్వామి దేవస్థానంలో కొనసాగుతున్న శాశ్వత అన్నదానానికి మండిపల్లి రాహుల్రెడ్డి, మైత్రేయి దంపతులు రూ. 1, 11, 116 శుక్రవారం ఉదయం విరాళం అందజేశారు. వీరు తన కుమారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నారాయణరెడ్డి మనవడు అయిన మండిపల్లి కుశాల్ రెడ్డి పేరు మీద వీరభద్రస్వామి ఆలయ ఈవో డీవీ రమణారెడ్డికి చెక్కు రూపంలో ఈ మొత్తం అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు వారిని సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.