రాయచోటి పట్టణంలోని మనం సామాజిక సేవా సంస్థ వారు చేస్తున్న సేవలు అమోఘమని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మనం సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 ఆక్సిజన్ అంబులెన్సులు, 1 ఐసీయూ, వెంటిలేటర్ అంబులెన్స్ 2, రధాలు, 8 ఫ్రీజర్ బాక్సులను ప్రారంభించారు.