నవోదయ కార్యక్రమం ద్వారా జిల్లాలో నాటుసారా తయారీ, అమ్మకం అరికడుతున్నామని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి మధుసూదన్ తెలిపారు. గురువారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ గడచిన మూడు నెలలలో నాటుసారా తయారు చేస్తున్న వారిపై 96 కేసులు నమోదు చేసి, 112 మందిని అరెస్టు చేశామని తెలిపారు. 1140 లీటర్ల నాటు సారా సీజ్ చేశామని, 49, 630 లీటర్ల బెల్లం ఊట ద్వంసం చేశామని, 2000 కిలోల నల్ల బెల్లం సీజ్ చేశామని ఆయన తెలిపారు.