యువతే దేశానికి శక్తి అని, యువత అన్ని రంగాలలో రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయచోటి మండల పరిధిలోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా యువజనోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని యువత మంచి మార్గాన్ని ఎంచుకొని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.