గుడిపల్లి: గుండెపోటుతో హెడ్ మాస్టర్ మృతి

79చూసినవారు
గుడిపల్లి: గుండెపోటుతో హెడ్ మాస్టర్ మృతి
తంబళ్లపల్లి నియోజకవర్గంలోని బి. కొత్తకోట మండలం గుడిపల్లి ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ ముని పద్మనాభం గురువారం గుండెపోటు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల నుంచి బెంగళూరులో గుండె సంబంధిత వైద్యం చేయించుకున్న ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి మదనపల్లిలోని ఇంటికి చేరుకున్నారు. గురువారం ఆయన మృతి చెందాడని ఎంఈవో రెడ్డి శేఖర్ తెలిపారు. ఆయన మృతికి ఎంఈవోలు రెడ్డిశేఖర్, భీమేశ్వరచారి, మండల ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్