AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో పీటీ వారెంట్పై ఆయనను నెల్లూరు జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రైవేట్ టోల్ గేట్ ఏర్పాటు చేశారనే ఫిర్యాదుతోనూ కాకాణిపై ముత్తుకూరు PSలో కేసు నమోదైన విషయం తెలిసిందే.