ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఆయన బుధవారం అమలాపురం మండలంలోని బండారులంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన విద్యాసామగ్రి కిట్లను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.