అయినవిల్లి మండలం అయినవిల్లిలో వేంచేసి ఉన్న విగ్నేశ్వర స్వామి వారి ఆలయానికి శుక్రవారం భారీగా భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా స్వామి వారి ఆలయానికి రూ 2, 58, 178 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలియజేశారు. భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయంలో ఏర్పాటు చేసామన్నారు.