మామిడికుదురు మండలం పాశర్
లపూడి లంకలో ముంపు నీటిసమస్య జటిలంగా మారింది. అంబేడ్కర్ నగర్, ఏటిగట్టు ప్రాంతం, ఉప్పాటి వారి మెరక, ఏటి బాడవ, గుడిమెల్లంక వారి ప్రాంతం, గరువు, గుత్తుల వారిమెరక, మేడిది వారి మెరక, తదితర ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. భారీ వర్షాల వల్ల ముంపు సమస్య ఏర్పడిందని సర్పంచ్ సూర్య ప్రకాష్ రావు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు నీరు ఎటూ వెళ్లే పరిస్థితి లేదని వాపోయారు.