మామిడికుదురు మండల పరిధిలోని లంక
గ్రామాలు వరద ముంపు నుంచి క్రమేపి తేరుకుంటున్నాయి. పాశర్లపూడి కరకట్ట దిగువన కాజ్వేపై బుధవారం మూడు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. ఈ మార్గంలో రాకపోకలు పునరుద్ధరణ జరగలేదు. అప్పనపల్లి, బి. దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామాల ప్రజలు మామిడికుదురు శివారు కొర్లగుంట ఏటిగట్టు దిగువన ఉన్న అప్పనపల్లి ఉచ్చుల వారిపేట మీదుగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.