ఉభయగోదావరి జిల్లాల పట్ట బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న రాజశేఖరం విజయానికి కూటమి పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. కొత్తపేట కళానగర్ వినాయకుని గుడిలో గురువారం పూజలు జరిపించి కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యానందరావు తనయుడు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కంఠం శెట్టి శ్రీను, బూసి భాస్కరరావు, గుబ్బల మూర్తి పాల్గొన్నారు.