వాడపల్లి లో వైభవంగా వెంకన్న సుప్రభాత సేవ

82చూసినవారు
ఆత్రేయపురం మండల పరిధిలోని వాడపల్లిలో వేంచేసి యున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ శనివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు, పండితులు మంత్రోచ్చారణలు మధ్య స్వామి వారి మేలుకొలుపు సేవ జరిగింది. స్వామివారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. స్వామివారిని కన్నులారా వీక్షించి పునీతులయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్