మండపేట రైతు బజార్ నుఎమెల్యే వేగుళ్ళ జోగేశ్వర రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుబజార్ లో స్టాల్స్ ను పరిశీలించి, కూరగాయల ధరల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైన సమస్యలు ఉంటే తెలపాలని అక్కడి రైతులను అడుగగావారు ఏ సమస్యలు లేవని ఎమ్మెల్యే కు వివరించారు. మీ సమస్య ఏదైనా అండగా ఉంటానని అందుబాటులోనే ఉంటానని ఎమ్మెల్యే జోగేశ్వరరావు వివరించారు.