ముమ్మిడివరం పరిధిలోని క్రాప చింతలపూడి గ్రామంలోని శ్రీ ఉమావల్లభేశ్వరస్వామి పునఃప్రతిష్ఠ మహోత్సవం మంగళవారం ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని పాయసం నారాయణమూర్తి స్థలమిచ్చి నిర్మించారు. యేటావారి వంశపారంపర్య ధర్మకర్తలు కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం రోడ్డుకి పల్లం కావడంతో గ్రామస్తులు ముమ్మిడివరంకి చెందిన వైద్యులు డా. జగన్మోహన్ సహకారం, విరాళాలు సేకరించి పునఃనిర్మించారు.