యు. కొత్తపల్లి మండలంలోని కొండెవరం శివారు శొంఠివారిపాకలు గ్రామంలో నిర్వహిస్తున్న కోడిపందేల శిబిరంపై మంగళవారం యు. కొత్తపల్లి పోలీసులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదు, కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ స్వామినాయుడు మీడియాకు తెలియజేసారు.