సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై మేడిశెట్టి ఇజ్రాయిల్ అనే వ్యక్తి చేస్తున్న అసత్య ప్రచారాలపై రామచంద్రపురంలోని కూటమి నాయకులు ముక్త కంఠంతో ఖండించారు. ఉమ్మడి పార్టీ కార్యాలయంలో శుక్రవారం కూటమి నాయకులు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇజ్రాయిల్ వైసీపీ పార్టీకి కోవర్టుగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.