AP: రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సందర్భంగా రాజధాని అమరావతి రెండో విడత భూసేకరణపై చర్చించనున్నారు. ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (AP-CRDA) ఆమోదించిన పనులకు ఆమోదం తెలపనుందని సమాచారం. అలాగే ఏపీకి కొత్త అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాల టెండర్లకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.