ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

72చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో ఇతరుల జోక్యం లేకుండా.. అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైదిక విధుల్లో దేవాదాయ కమిషనర్ సహా ఏ అధికారి జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆధ్యాత్మిక విధుల విషయంలో అర్చకులదే తుది నిర్ణయమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోతే.. పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

సంబంధిత పోస్ట్