ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుపై కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం..తల్లికి వందనం పథకాల అమలుపైన చర్చ జరిగింది. ఈ సమయంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. వచ్చే సంక్రాంతికి తల్లికి వందనం.. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఉచిత బస్సు పథకం అమలు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.