ఏపీలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో అక్టోబర్లో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచారం. గత జగన్ ప్రభుత్వంలో పింఛన్లు రద్దైన వారి నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన కూటమి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులు స్వీకరించిన 60రోజుల్లోగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.