AP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో పనిచేసిన సత్యవర్ధన్ను అపహరించి దాడి చేసిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫోన్పై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఫోన్లో కీలకమైన ఆధారాలు లభించే అవకాశాలు ఉందని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసే సమయంలో వంశీ ఫోన్ దొరకలేదు. వ్యక్తిగత సహాయకుడి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. తాజాగా వంశీ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.