స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు

38చూసినవారు
స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు
AP: ప్రభుత్వ స్కూళ్లకు పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు మూడు రోజులకు మించి స్కూళ్లకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని ఆదేశించింది. 5 రోజుల కంటే ఎక్కువ బడికి రాకపోతే MEO, CRPలు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలని సూచించింది. టీచర్లు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెబుతూనే, టీచర్లు సెలవు పెడితే వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్