ఏపీ బీజేపీ కొత్త చీఫ్ ఎవరన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆ పదవిలో ప్రస్తుతం ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి పదవీ కాలం తొందరలో పూర్తి కావస్తోంది. ఆమె 2022లో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీలో అధ్యక్ష పదవీ కాలం రెండేళ్ళు మాత్రమే. ఇదిలా ఉంటే ఏపీ బీజేపీ చీఫ్గా ఎవరిని నియమిస్తారన్నది పాయింట్. అయితే ఏపీ బీజేపీ చీఫ్గా ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా వ్యవహరించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ అధిష్టానం ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.