సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

64చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలలో రెండో రోజు పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం వకుళమాత వంటశాలను ప్రారంభించారు. అనంతరం పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడేలా అధికారులు పనిచేయాలని సూచించారు. భక్తులకు నాణ్యమైన ఆహారం, ప్రసాదాలు అందజేయాలన్నారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. వీఐపీ సంస్కృతిని తగ్గించాలని, సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అటవీని సంరక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్