లాటరీలో మద్యం దుకాణం పొందిన వ్యాపారి కిడ్నాప్

55చూసినవారు
లాటరీలో మద్యం దుకాణం పొందిన వ్యాపారి కిడ్నాప్
ఏపీ ప్రభుత్వం సోమ‌వారం నిర్వహించిన లాటరీలో మద్యం దుకాణం దక్కించుకున్న వ్యాపారిని కొందరు దుండగులు అపహరించారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో చోటు చేసుకుంది. పుట్టపర్తిలో నిర్వహించిన లాటరీలో దుకాణాన్ని దక్కించుకొని రంగనాథ్‌ అనే వ్యాపారి బయటకు రాగానే అపహరించి తీసుకెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న అతడి భార్య అశ్విని పుట్టపర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్