కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. యూపీఏ హయాంలో జరిగిన వైఫల్యాలను ఎన్డీఏకు ఆపాదించడం రాహుల్ అవివేకం అని విమర్శించారు. కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో 6 శాతం ఉపాధి పెరిగితే బీజేపీ పాలనలో ఉపాధి 36 శాతానికి పెరిగిందని అన్నారు. మోడీ 10 ఏళ్ల పాలనలో 4.9 కోట్ల ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. 2023-24 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గిందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.