వైసీపీ నేత వల్లభనేని వంశీని మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని పరామర్శించారు. వంశీ ఇటీవలే జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో ఉంగటూరులోని తేలప్రోలు గ్రామంలో ఉన్న అతడి నివాసంలో ఆత్మీయంగా కలిశారు. వంశీ ఆరోగ్యంపై ఇరువురు నేతలు అడిగి తెలుసుకున్నారు. కాగా శనివారం ఉదయం కోర్టు విధించిన షరతుల మేరకు గుడివాడ, గన్నవరం పోలీస్ స్టేషన్ల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ సంతకాలు చేశారు.