అమలాపురం మండలం బండారులంక వద్ద శుక్రవారం పీవీ నరసింహరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ కమిటీ జిల్లాధ్యక్షుడు కామన ప్రభాకరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.