అమలాపురం రూరల్ మండల పరిధిలోని భట్నవిల్లిలో వాహనదారులకు మంగళవారం హెల్మెట్ ధారణపై అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని జాతీయ రహదారి పక్కన నిలిపి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నారు. హెల్మెట్ ధారణ తప్పనిసరి అని ఆయన సూచించారు.