అల్లవరం మండలంలోని 23 సచివాలయాల పరిధిలో తొలిరోజు జూలై 1 సచివాల ఉద్యోగులు 100% పింఛన్లు పంపిణీ చేయాలని ఎంపీడీవో కృష్ణమోహన్ శుక్రవారం అన్నారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో పింఛన్ల పంపిణీ పై కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఉదయం 6 గంటల నుండి లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పింఛన్లు అందించాలన్నారు.