అయినవిల్లి మండలంలోని వీరవల్లిపాలెం గ్రామంలో శనివారం అధికారులు వాటర్ క్వాలిటీ టెస్టింగ్ చేశారు. ప్రతి కుళాయి దగ్గరకు వెళ్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ రవి, ఇంజినీరింగ్ అసిస్టెంట్ రాజలక్ష్మి క్వాలిటీ టెస్టింగ్ నిర్వహించారు. సీజన్ వ్యాధులు రాకుండా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల అనంతరం నీరు తాగటానికి ఏ విధమైన లోపం లేదని రాజలక్ష్మి తెలిపారు. పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.