అయినవిల్లి మండలం, కె. జగన్నాధపురం గ్రామంలో వైసీపీ పి. గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. వైసీపీ సీనియర్ నాయకులు మేడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. నియోజక వర్గ అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.