అయినవిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సభా వేదికపైకి టీడీపీ, జనసేన చెందిన పలువురు నాయకులను పిలవకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దాల సుబ్బారావు నిలదీయగా ఎమ్మెల్యే స్పందించి వారిని కూడా వేదికపైకి పిలవాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది.