కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన విచ్చేశారు. ఎమ్మెల్యేకు జిజిహెచ్ సూపర్డెంట్ డా. లావణ్య కుమారి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచి వైద్యం అందించాలని సూచించారు. మందులు కొరకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు.