కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన బుధవారం టిడ్కో గృహా సముదాయంలోని పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. 3, 4 సర్కిల్స్ పరిధిలోని డైరీ ఫారం సెంటర్, అయోధ్య నగర్ ప్రాంతాలలోని మస్టర్ కేంద్రాలను కూడా కమిషనర్ సందర్శించారు. అక్కడి పారిశుధ్య కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలంటే ప్రజల భాగస్వామ్యంతో సమిష్టిగా పని చేయాలని సూచించారు.