డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి అన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని జబర్దస్త్ ఫేమ్ వర్ష శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శన వల్ల తాను అనుకున్నవన్నీ జరగాయని, ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించుకుని తమ కోర్కెలను నెరవేర్చుకోవాలన్నారు. దేవస్థానం అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.